భారత్​ తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్​.వెంకటరమణి

-

భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణి(91) నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఆయనను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు.  ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ పదవీ కాలం ఈనెల 30తో ముగియనుంది. అనంతరం కొనసాగడానికి వేణుగోపాల్‌ ఇప్పటికే తిరస్కరించారు.

అయితే అటార్నీ జనరల్ పదవిని చేపట్టాలని మరో సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్​ రోహత్గీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినా.. అందుకు ఆయన అంగీకరించలేదు. రోహత్గీ ఇదివరకు 2014 జూన్‌ 19 నుంచి 2017 జూన్‌ 18 వరకు అటార్నీ జనరల్‌గా కొనసాగారు. అప్పుడు రెండోసారి కొనసాగించడానికి ప్రభుత్వం ప్రయత్నించగా తిరస్కరించారు.

దాంతో 86 ఏళ్ల వయస్సులో కేకే వేణుగోపాల్‌ను మూడేళ్ల కాలానికి ప్రభుత్వం ఆ బాధ్యతలు అప్పగించింది. తర్వాత ఆయన్నే కొనసాగించింది. జూలై 2017లో ఆ పదవికి నియమితులయ్యారు. జూన్ 29న మూడు నెలల పాటు దేశ అత్యున్నత న్యాయ అధికారిగా మళ్లీ నియమితులయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version