ప్రధాని నరేంద్ర మోడీ నేడు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ‘సింధూర్’ మొక్కను నాటి ఆ చెట్టుకు నీళ్లు పోశారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “ఏక్ పేడ్ మాకే నామ్” రెండో దశ కార్యక్రమంలో భాగంగా 10,000 మొక్కలు నాటాలని మోదీ పిలుపునిచ్చారు.

ఇటీవల ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్న సమయంలో 1971 ఇండో – పాక్ యుద్ధంలో సాహసం ప్రదర్శించినటువంటి మహిళలు మోధీని కలిసి సింధూర్ మొక్కను బహుకరించారు. ఆ మొక్కను తన నివాసంలో నాటుతానని మోదీ వారికి మాటని ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మోదీ తన అధికారిక నివాసంలో మొక్కను నాటారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.