తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో జరగనున్న కేబినెట్ మీటింగ్ కు వెళుతుండగా మంత్రి కొండా సురేఖ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. దీంతో ఆమెను వెంటనే సెక్రటేరియట్ లోని ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఆమె ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగినట్లుగా వైద్యులు వెల్లడించారు. కేవలం నీరసం కారణంగానే ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం కొండా సురేఖ సెక్రటేరియట్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.