‘ఆపరేషన్ సింధూర్’పై ఎక్స్ లో స్పందిచారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. మరో పహల్గామ్ ఘటన జరగకుండా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పాలని తెలిపారు.

పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలన్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఇక అటు పాకిస్థాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేయడంతో పాక్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, షెషావర్ ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి సెలవును పాక్ అధికారులు రద్దు చేశారు. పాక్ పంజాబ్ ప్రావిన్స్ లోని విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు.