World Cup 2023 : పాక్ ప్లేయర్లు హైదరాబాద్‌ వస్తున్నారు!

-

World Cup 2023 : పాక్ ప్లేయర్లు హైదరాబాద్‌ వస్తున్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ కోసం క్రికెట్ జట్ల రాక ప్రారంభమైంది. గత రాత్రి న్యూజిలాండ్ ప్లేయర్లు కొందరు హైదరాబాద్ చేరుకోగా… బుధవారం మిగతా ఆటగాళ్లు రానున్నారు.

Pak players are coming to Hyderabad

పాక్ జట్టు బుధవారం రాత్రి 8:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది. బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్ లో పాక్ జట్టుకు, ఐటిసి కాకతీయలో కివిస్ జట్టుకు వసతి కల్పించనున్నారు. ఈ రెండు జట్లు 29న మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నాయి.

కాగా, WCలో భాగంగా పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 29న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అదే టైంలో గణేష్ నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబీ ఉత్సవాల కారణంగా మ్యాచ్ కి ప్రేక్షకులను అనుమతించట్లేదు. కాగా, ఈ మ్యాచ్ కి ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version