ఇవాళ ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్

-

 

ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అయితే..ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరుగనున్న వార్మప్ మ్యాచ్ కు ప్రేక్షకులకు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రేక్షకులు లేకుండానే ఈ వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అటు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి పాకిస్థాన్, న్యూజిలాండ్ టీమ్స్.

Pakistan and New Zealand warm up match at Uppal Stadium today

హైదరాబాద్ లో 14 రోజులు ఉండనుంది పాక్ టీమ్. ప్రస్తుతం పార్క్ హయత్ హోటల్ లో బస చేసింది పాక్ టీమ్. పాకిస్థాన్ టీమ్ కి భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏడేళ్ల తర్వాత ఇండియా లో అడుగుపెట్టింది పాక్ టీమ్. ఇవాళ న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్‌. అలాగే… అక్టోబర్ 3న పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్‌ జరుగనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్ తో లీగ్ మ్యాచ్ ఉండనుంది. అక్టోబర్ 10న శ్రీలంక తో లీగ్ మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version