నేడు పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం ఉండనుంది. ఈ తరుణంలో జాతికి పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్నీ అంకితమివ్వనున్నారు ప్రధాని మోడీ. భారత్లో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

ఈరోజు పాంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది.
- నేడు పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం..
- జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోడీ..
- దేశంలో తొలిసారిగా వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి..
- తమిళనాడులోని రామనాథపురంలో, రూ. 535 కోట్లతో పంబన్ వంతెన నిర్మాణం..