ప్రధాని మోదీ పాములాంటి వ్యక్తి – ఖర్గే

-

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ పాము లాంటి వ్యక్తి అని విమర్శించారు. ఆయనకి ఒళ్లంతా విషమే ఉంటుందని అన్నారు. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని ఎన్నికల ప్రచార సభలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. పాము కాటు వేస్తే మృత్యువు ఎలా సంభవిస్తుందో మోడీతో కూడా అంతేనని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీని విష సర్పంతో పోల్చారు. ఒకవేళ ఆయన విష సర్పం కాదని అనుమానంతో తాకి చూస్తే అది మీకే ప్రమాదం అని వ్యాఖ్యానించారు మల్లికార్జున ఖర్గే. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version