పంజాబీ సింగర్ సిద్దు మూసేవాలా హత్యకు సూత్రధారులను నిర్ధారించిన పోలీసులు

-

ఇటీవల పంజాబీ ర్యాప్ సింగర్ సిద్దు మూసేవాలా హత్య తీవ్ర కలకలం రేపింది. సిద్దు మూసేవాలాకు ప్రభుత్వం భద్రత ఉపసంహరించిన మరుసటిరోజే హత్య జరిగింది. కాగా ఈ హత్య గ్యాంగ్ వార్ లో భాగంగానే జరిగినట్లు పోలీసులు మొదటినుంచీ అనుమానిస్తున్నారు. ఇక ఈ హత్య తమ పనే అంటూ కెనడా వాసి గోల్డీ బ్రార్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మేరకు పోలీసుల సందేహాలు కొంతమేర బలపడ్డాయి.

తీహార్ జైల్లో ఉన్న కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ని విచారించే సరికి పోలీసులు ఈ హత్య అతడి ముఠా పనే అని నిర్ధారించారు. సిద్దు మూసేవాలా హత్యకు ప్రధాన సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్ అని స్పెషల్ సెల్ కమిషనర్ హెచ్ఎస్ దలీవాల్ వెల్లడించారు. లారెన్స్ ముఠా సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. అయితే సిద్దు మూసేవాలా హత్య లో పాల్గొన్న ప్రధాన షూటర్ ఇంకా దొరకలేదని తెలిపారు. ప్రధాన షూటర్ కు సన్నిహితుడైన సిద్దేశ్ కమ్లేని పూణేలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురు నిందితులను గుర్తించామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version