నేడు 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ 11 రాష్ట్రాలకు అవసరాలను  దృష్టిలో ఉంచుకొని ఇవాళ  9 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలు ఈ రైళ్లు కలపనున్నాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమబెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయాణికులు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు కొత్తగా ప్రారంభించే వందే భారత్ రైళ్లు సహాయపడనున్నాయి. 

ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి కూడా వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య నడపాలని కేంద్ర నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇది తెలుగు రాష్ట్రాలకు మూడో వందే భారత్ రైలు కానుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రధాని జెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

విజయవాడ నుంచి చెన్నైకి మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇవాళ మధ్యాహ్నం 12.30 నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బయలుదేరనుంది. ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, మీదుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ చెన్నై వెళ్లనుంది. మొత్తం ప్రయాణానికి 6 గంటల 30 నిమిషాల సమయం పట్టనుంది. రైల్వేలో అధునాతన ఫీచర్లను జోడించడంతో పాటు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేర్చేందుకు భారత్ రైల్వే వందే బారత్ రైళ్లను తీసుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version