రాహుల్ గాంధీ సంచలన కామెంట్లు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ సంచలన కామెంట్లు చేశారు. ఈ సంవత్సరం జరిగే బీహార్ ఎన్నికలలో అదే జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారు.

ఎన్నికల కమిషన్ ప్యానల్ ఎంపికలో అవకతవకలు, ఫేక్ ఓట్లను నమోదు చేయడం, ఓటింగ్ శాతం పెరిగినట్లు చూపించడం, బీజేపీకి అవసరమైన చోట బోగస్ ఓట్లు వేయించడం ద్వారా కుట్రకు తెర లేపారని రాహుల్ గాంధీ అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ తో గెలుచుకోవచ్చు కానీ వ్యవస్థలు నాశనమవుతాయని రాహుల్ గాంధీ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.