పాక్‌ పై మేం కచ్చితంగా గెలుస్తాం – రోహిత్‌ శర్మ

-

ఇవాళ ఇండియా-పాక్‌ మధ్య భీకర పోరు జరుగనుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇవాళ జరిగే ఇండియా-పాక్‌ పోరు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక మొదట టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌ పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించారు.


ఇవాళ పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్లో టాస్ బిగ్ ఫ్యాక్టర్ కాకపోవచ్చని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ‘అహ్మదాబాద్ లో మంచు ప్రభావం ఉండకపోవచ్చు. నా దృష్టిలో ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. కొత్త ఛాలెంజ్ లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పాక్ మంచి క్వాలిటీ ఉన్న జట్టు. గత రెండు మ్యాచుల్లో మేము బాగా ఆడాము. ఈ విన్నింగ్ ఫామ్ ను ఇలాగే కంటిన్యూ చేస్తాం’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version