లక్నోలో సౌదీ విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం టైర్ నుంచి పొగలు వచ్చాయి. ఇక ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చింది రెస్క్యూ టీమ్.. దింతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. దింతో 250 మంది హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి లక్నో వచ్చిన విమానానికి ప్రమాదం తప్పింది.

ఇక అటు మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. హాంకాంగ్ నుంచి దిల్లీకి వస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలట్లు. దింతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు పైలట్లు.