జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ పార్టీ అప్పగించు – అసదుద్దీన్ ఒవైసీ

-

Mim పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అలాగే నారా చంద్రబాబు నాయుడు పై ఫైరయ్యారు అసదుద్దీన్ ఓవైసీ. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నాడని రెచ్చిపోయారు.

MIM party chief Asaduddin Owaisi made controversial remarks
MIM party chief Asaduddin Owaisi made controversial remarks

అబద్ధపు హామీలు, తప్పుడు మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు… పరువు పోగొట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని… ఇంకా ఎన్నిరోజులు ముఖ్యమంత్రిగా ఉంటావని వచ్చి పోయారు. నీ తర్వాత పార్టీకి వారసుడు నీ కొడుకే కదా… జూనియర్ ఎన్టీఆర్ కాదుగా అని చురకలాంటించారు. కావాల్సి ఉంటే అతనికి పార్టీని అప్పగించు అని అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news