కాంగ్రెస్ పార్టీలో విషాదం.. సీనియర్ నాయకుడు కన్నుమూత…

-

కాంగ్రెస్ పార్టీ లో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నాయకులు కే శంకరనారాయణ ఆదివారం కేరళలోని పాలక్కడ్ లోని తన నివాసంలో కన్నుమూశారు. 89 సంవత్సరాలు ఉన్న శంకరనారాయణ… గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తన రాజకీయ కెరీర్ లో శంకర్ నారాయణ…. మహారాష్ట్ర, నాగాలాండ్, జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు.

అంతేకాకుండా గోవా, అరుణాచల్ ప్రదేశ్ , అస్సాం గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆయన నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. అదే క్రమంలో కేరళ లోని ప్రభుత్వo లో వ్యవసాయం, ఆర్థిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version