అబ్దుల్‌ కలాం ఫోన్‌ చేస్తే రాంగ్‌ నంబర్‌ అని పెట్టేశా : సుధామూర్తి

-

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రచయిత్రి, వితరణశీలి సుధామూర్తి సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి తనకు ఓసారి ఫోన్‌ వస్తే నమ్మలేక ‘రాంగ్‌ నంబర్‌’ అని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. మాజీ రాష్ట్రపతితో తన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను పంచుకున్నారు.

‘‘ఒక రోజు నాకో ఫోన్‌ కాల్‌ వచ్చింది. అబ్దుల్‌ కలాం నాతో మాట్లాడాలనుకుంటున్నట్లు ఆపరేటర్‌ చెప్పారు. ఆయనతో నాకు ఎలాంటి పరిచయం లేదు కాబట్టి నేను వెంటనే ‘రాంగ్ నంబర్‌’ అని చెప్పా. నా భర్త నారాయణమూర్తికి చేయబోయి పొరబాటున నాకు చేశారేమో చూసుకోండి అని అన్నా. అప్పుడు ఆపరేటర్‌ స్పందిస్తూ ‘కలాంజీ ప్రత్యేకంగా మీతోనే మాట్లాడాలని చెప్పారు అని అన్నారు. నేను ఒకింత ఆందోళనకు గురయ్యా. ఆ తర్వాత అబ్దుల్‌ కలాంజీ నాతో మాట్లాడారు. ‘ఐటీ డివైడ్‌’ అనే అంశంపై నేను రాసిన కాలమ్‌ తాను చదివానని, బాగుందని చెప్పారు’’ అంటూ నాటి సంగతిని గుర్తుచేసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version