BREAKING : రేపు, ఎల్లుండి ఢిల్లీలో జి20 సమావేశాలు..ట్రాఫిక్ ఆంక్షలు అమలు

-

జీ20 సమావేశానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు, ఎల్లుండి ఢిల్లీలో జి20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే.. ఇవాళ భారత్ కు చేరుకోనున్నారు అగ్రదేశాల అధినేతలు. ఈ జీ 20 సమావేశాలకు 20 సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాలు హాజరవుతున్నాయి. ఈ తరుణంలోనే.. ఢిల్లీలో మొదలయ్యాయి ట్రాఫిక్ ఆంక్షలు.

Tomorrow, G20 meetings in Delh

ఇక ఇటు ఈరోజు ఇండియాకు రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ అవనున్నారు. జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మోదీ.. ఈ భేటీలో శుద్ధ ఇంధనం, వాణిజ్యంపై చర్చించనున్నారు. హైటెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధంపై సమీక్ష జరపనున్నారు. అలాగే రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవల మోదీ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందాల పురోగతిపై సమీక్ష చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version