తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ

-

హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తం ఏడుగురు జడ్జిలను బదిలీ చేయగా.. అందులో నలుగురు కర్ణాటక, ఇద్దరు తెలంగాణ, ఒకరు ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి ఉన్నారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆమోదం తెలిపింది.

ఏప్రిల్ 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగిన కొలీజియం సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ హేమంత్ చందన్​గౌడర్ కర్ణాటక హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.  మరో జడ్జి జస్టిస్ కృష్ణన్​ నటరాజన్ కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ నెరనహళ్లి శ్రీనివాస్ సంజయ్ గౌడను గుజరాత్ హైకోర్టుకు, ఒడిశా హైకోర్టుకు జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపాద్​ను బదిలీ చేసింది.  తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పెరుగు శ్రీ సుధ కర్ణాటకకు, జస్టిస్ కాసోజు సురేందర్​ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కుంభజడల మన్మధరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news