భారతదేశంలో ఫెర్టిలిటీ సంఖ్య పూర్తిగా పడిపోయిందని యునైటెడ్ నేషన్స్ సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. చాలామందికి ఫెర్టిలిటీపై పూర్తిగా క్లారిటీ లేదని వెల్లడించారు. ఒక్కో మహిళ సగటు సంతాన రేటు 1.9 జనాలకు పడిపోయినట్టుగా యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. ఇది రిప్లేస్మెంట్ ఫెర్టిలిటీ రేట్ 2.1 కన్నా తక్కువగా ఉందని అన్నారు. ప్రస్తుత జనాభా సంఖ్య భవిష్యత్తులో తగ్గకుండా మెయింటైన్ చేయడం చాలా కష్టమని యునైటెడ్ నేషన్స్ సంస్థ పేర్కొన్నారు.

మరోవైపు ఈ సంవత్సరంలో జనాభా 146 కోట్లకు చేరుతుందని యునైటెడ్ నేషన్స్ అంచనా వేసింది. కాగా నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ కారణంగా పిల్లలను కనడం చాలా ఆలస్యం చేస్తున్నారు. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ఉద్యోగాలు చేయడం, డబ్బులు సంపాదించడం మీదే పూర్తి ధ్యాస పెడుతున్నారు. వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వయసు మీద పడితే పిల్లలు పుట్టడం చాలా కష్టమని తెలిసినప్పటికీ దాని గురించి అసలు ఆలోచించకుండా డబ్బు మాయలో పడిపోయి కష్టపడుతున్నారు.