అడవిలో అమెరికా మహిళ కేసులో ట్విస్ట్

-

ఇటీవల మహారాష్ట్ర సింధు దుర్గ్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తూ పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఓ మహిళ కనిపించిన విషయం తెలిసిందే. ఆమెను గుర్తించిన పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అయితే ఈ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. చెట్టుకు ఇనుప గొలుసులతో బంధించడంలో ఇతరుల ప్రమేయం లేదని, తనను తానే అలా బంధించుకున్నానని ఆ మహిళ చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త కూడా లేడని చెప్పింది.

ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన విషయాలతో ఖాకీలు కంగుతిన్నారు. తన వెంట మూడు తాళాలు, ఇనుప గొలుసులు తెచ్చుకుని అందులో ఓ తాళంతో తనకు తానే చెట్టుకు కట్టేసుకుందని వాంగ్మూలంలో ఆ మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను గుర్తించిన కొన్ని మీటర్ల దూరంలోనే తాళాలు గుర్తించినట్లు చెప్పారు. అయితే ఆమె చెట్టుకు కట్టేసుకుని ఎన్ని రోజులైందనే విషయం మాత్రం తెలియదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version