బ్రేకింగ్ : వెంకయ్య నాయుడుకు కరోనా నెగటివ్

-

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు తాజాగా కరోనా నెగటివ్ అని తేలింది. సెప్టెంబర్ 29 న COVID-19 బారిన పడిన అయన అప్పటి నుండి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. వెంకయ్య భార్య ఉషా నాయుడుకు కూడా కరోనా వైరస్ పరీక్ష జరుపగా అప్పుడే ఆమెకు నెగటివ్‌ వచ్చింది.

venkayya naidu

ఈ విషయాన్ని వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫీస్ కొద్ది సేపటి క్రితం ట్విట్టర్‌లో తెలిపింది. ఈరోజు ఎయిమ్స్ నిర్వహించిన RT-PCR పరీక్ష ప్రకారం, ఉపాధ్యక్షుడు మరియు అతని భార్య శ్రీమతి ఉషా నాయుడు ఇద్దరికీ నెగటివ్ అని తేలింది. నాయుడు ఆరోగ్యం కుదుట పడడంతో, డాక్టర్ సలహా మేరకు త్వరలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version