బుక్స్ ఇస్తానని పిలిచి బాలికపై పక్కింటి వ్యక్తి ఆత్యాచారం

-

రోజురోజుకు మైనర్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నారు. ఆరునెలల పసికందులపై కూడా మృగాళ్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వావి వరసలు మరిచి కీచకుల్లా మారి చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ అంబర్​పేట్​ పటేల్​నగర్​లో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై పక్కింట్లో ఉండే జయంత్ చారి(40) కన్నేశాడు. అదనుచూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడాలనుకున్నాడు. దాని కోసం ప్లాన్ వేశాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూశాడు. పుస్తకాలు ఇస్తానని ఆమెను తన ఇంటికి పిలిచాడు.

ఇంట్లోకి రాగానే బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అతడి చేష్టలకు భయపడ్డ బాలిక గట్టిగా అరుస్తూ బయటకు పరుగు తీసింది. తన తల్లిదండ్రులున్న చోటుకు వెళ్లి విషయం చెప్పింది. ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు అతనిపై దాడి చేయడానికి వెళ్లారు. కానీ అప్పడికే అతడు అక్కణ్నుంచి పరారయ్యారు.

అనంతరం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అంబర్​పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్​స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version