ద్రౌపది ముర్ము పేరుతో కొత్త మొక్క.. ఎందుకు ఈ పేరు పెట్టారంటే?

-

ప్రకృతి ఒడిలో దాగివున్న రకరకాల రహస్యాలు ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా తమిళనాడు తీరంలో వృక్షశాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత అరుదైన కొత్త రకం మొక్కను కనుగొన్నారు. సముద్రపు తీవ్రమైన గాలులు ఉప్పు నేలలను తట్టుకుని నిలబడే ఈ వింత మొక్కకు మన దేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి గౌరవార్థం ‘ల్యూకాస్ ద్రౌపదియే’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ ఆవిష్కరణ అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

తీరంలో వెలుగు చూసిన అరుదైన వింత: తమిళనాడులోని కుడ్డలోర్ సముద్ర తీరంలో పరిశోధకులు పర్యటిస్తున్నప్పుడు ఇసుక దిబ్బలపై ఒక కొత్త తరహా మొక్క కనిపెట్టారు. ఇక గాలి తీవ్రత ఎక్కువగా ఉండే ఉప్పు నేలల్లో ఇది పెరగడం చూసి, శాస్త్రవేత్తలు ఏడాది పాటు దీని జీవన చక్రాన్ని గమనించారు. లండన్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలోని నిల్వలతో పోల్చి చూశాక, ఈ ప్రజాతిలోని 155 రకాల మొక్కల కంటే ఇది పూర్తిగా వేరైనదని తేలింది.

New Plant Named After Droupadi Murmu: Here’s Why It Got This Name
New Plant Named After Droupadi Murmu: Here’s Why It Got This Name

తులసి కుటుంబమే.. కానీ ఎంతో ప్రత్యేకత: మనందరికీ తెలిసిన తులసి, పుదీనా కుటుంబానికే చెందినప్పటికీ ఈ మొక్క తీరు చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఈ జాతి మొక్కలు తీగల్లా పాకుతాయి లేదా పొదల్లా పెరుగుతాయి. కానీ ‘ల్యూకాస్ ద్రౌపదియే’ మాత్రం ఎటువంటి కొమ్మలు లేకుండా 15 సెంటీమీటర్ల ఎత్తులో ఒంటరి కాడపై నిటారుగా పెరుగుతుంది. ఇక వేడి ఇసుకను తట్టుకోవడానికి దీనికి పైపైన పరుచుకునే పీచు వేళ్లు ఉంటాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు ఎందుకంటే?: సాధారణ గిరిజన ప్రాంతం నుంచి వచ్చి దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అధిష్టించిన ద్రౌపది ముర్ము గారి సేవా నిరతికి గుర్తుగా దీనికి ఈ పేరు పెట్టారు. ఎంతటి ప్రతికూల వాతావరణం, ఒత్తిడి ఎదురైనా సముద్రపు గాలల మధ్య ఈ మొక్క గట్టిగా తట్టుకుని నిలబడుతుంది. ఇక సరిగ్గా ముర్ము గారి జీవన పోరాటానికి ఇది ప్రతీకగా నిలవడమే ఈ నామకరణానికి ముఖ్య కారణం.

తమిళనాడు జీవ వైవిధ్యానికి కొత్త గుర్తింపు: ఈ కొత్త ఆవిష్కరణతో తమిళనాడు తీర ప్రాంతపు జీవ వైవిధ్యం అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. మన ప్రకృతిలో ఇంకా గుర్తించాల్సిన వింతలు ఎన్నో ఉన్నాయని ఈ పరిశోధన మరోసారి నిరూపించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news