పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్..!

-

స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఏడాదికి ఒక్క సినిమా విడుదల చేసిన సరే తన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు అని చెప్పవచ్చు. ఇందుకు కారణం ఆయన సినిమాలు రీ రిలీజ్ చేస్తుండడంతో వాటికి వస్తున్న రెస్పాన్స్ అని చెప్పవచ్చు. 2021లో వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 2022లో భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇలా ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లు సినిమాతో ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాడు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తూ మరింత పాపులారిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జల్సా సినిమా రీ రిలీజ్ చెయ్యగా డైరెక్ట్ సినిమా తరహాలో మొదటి రోజే భారీ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31వ తేదీన గత ఏడాది ఖుషి సినిమాను రిలీజ్ చేయగా.. సినిమా విడుదలై మూడు రోజుల కూడా కాలేదు అప్పుడే రూ.5 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో కల్ట్ క్లాసిక్ మూవీ అయిన తొలిప్రేమ సినిమాని కూడా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ , కీర్తి రెడ్డి జంటగా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు రోజుకొక ట్రీట్ ఇస్తున్నారు నిర్మాతలు.

Read more RELATED
Recommended to you

Latest news