జగన్ క్లోజ్ సర్కిల్ ని టార్గెట్ చేసిన నిమ్మగడ్డ ?

-

ఏపీ సర్కార్ ని టార్గెట్ చేసే విషయంలో నిమ్మగడ్డ దూకుడు పెంచారు. ఇప్పటి దాకా జగన్ కి సహకరిస్తున్న అధికారులను టార్గెట్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా సీఎం క్లోజ్ సర్కిల్ నే టార్గెట్ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్మణరేఖ దాటారని గవర్నర్ కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. నా మీద రాజకీయ దాడి చేస్తున్నారని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు.

సజ్జల అనే వ్యక్తి ప్రభుత్వం నుండి జీత భత్యాలు తీసుకుంటూ రాజ్యంగ పదవిలో ఉన్న తన మీద ఒక పార్టీ ఆఫీస్ లో కూర్చుని విమర్శించారని దీంతో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని కూడా నిమ్మగడ్డ లేఖలో కోరారు. ఈ విషయంలో అవసరం అయితే భారత అటార్నీ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని లేఖలో నిమ్మగడ్డ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version