నడవలేని స్థితిలో నిత్యామీనన్..ఆందోళనలో అభిమానులు..!

-

నిత్య మీనన్.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉండే హీరోయిన్లలో నిత్యామీనన్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా నిత్యా మీనన్ ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఇందుకు సంబంధించి.. హైదరాబాదులో నిర్వహించిన మోడ్రన్ లవ్ హైదరాబాద్ సీరీస్ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ కి అందులో నటించిన ఆర్టిస్టులంతా హాజరయ్యారు ఇక అయితే ఈవెంట్లో నిత్యమీనన్ ఒక స్టిక్ పట్టుకొని మరో ఇద్దరి సహాయంతో నడుచుకుంటూ స్టేజ్ పైకి వెళ్ళింది.. నిత్య ను అలా చూసి అందరూ ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఇక నిత్యామీనన్ కి ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్న సమయంలోనే నిత్య స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ.. ఈ సిరీస్ లో ఇలాంటి క్యారెక్టర్ లో నేను చేశాను. కానీ ఇప్పుడు నిజంగా ఇలా జరిగింది.. ఇక ఇటీవల ఇంట్లో స్టెప్స్ మీద నుంచి స్లిప్ అయి పడ్డాను. దాంతో ఇలా జరిగింది అంటూ నిత్యామీనన్ వెల్లడించింది.

ఇకపోతే నడవలేని పరిస్థితుల్లో కూడా నిత్యమీనన్ ఇలా తాను నటించిన సిరీస్ ప్రమోషన్స్లో పాల్గొనడం చూసి ప్రతి ఒక్కరు ఆమె డెడికేషన్ కు మెచ్చుకుంటున్నారు. అంతేకాదు నిత్యామీనన్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సైతం ఆశిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే మలయాళం కుట్టి గా గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ తెలుగులో ఒక పక్క సినిమాలు చేస్తూనే. మరో పక్క పలు వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న నిత్యామీనన్.. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం లో జడ్జిగా కూడా వ్యవహరించింది.

ఇలా ఒక వైపు సినిమాలు.. మరో వైపు వెబ్ సీరీస్లు.. ఇంకొకవైపు షోలు చేస్తూ బిజీబిజీగా తన జీవితాన్ని గడుపుతుంది నిత్యామీనన్. ఇకపోతే తాజాగా నిత్యామీనన్ నటించిన వెబ్ సిరీస్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ జూలై 8వ తేదీ నుంచి అమెజాన్ లో టెలికాస్ట్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version