కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్

-

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీలోని నితిన్ గడ్కరీ నివాసానికి ఫోన్ చేసిన అగంతకులు చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి నితిన్ గడ్కరీ సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి వచ్చిన హత్య బెదిరింపు కాల్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయన సిబ్బంది తమకు అందించారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపింది.
గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని, ఇందుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, నిందితుడు ల్యాండ్ లైన్ నుండి ఫోన్ చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. దర్యాఫ్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. అన్ని కాల్ రికార్డ్స్ వివరాలు విశ్లేషిస్తున్నామని, నిందితులు ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసారు కాబట్టి నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version