దిశ కేసు : ఐపీఎస్ అధికారి సజ్జనార్ కు నోటీసులు !

-

హైదరాబాద్‌ మహ నగరం లో రెండు సంవత్సరాల కిందట… దిశ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన లో ఓ మహిళ డాక్టర్‌ ను నలుగురు కిరాతకులు అత్యంత దారుణం గా రేప్‌ చేసి… కాల్చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ దిశ రేప్ కేసులో.. నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రేప్ చేసిన స్థలం లోనే నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇది ఇలా ఉండగా… ఈ ఎన్‌ కౌంటర్‌ పై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది.

ఈ నేపథ్యం లోనే తాజాగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ కు సమన్లు జారీ చేసింది త్రిసభ్య కమిటీ. దీంతో దిశ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు సజ్జనార్‌. ఈ కేసును మంగళవారం లేదా బుధవారం విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక నేడు త్రిసభ్య కమిటీ ముందుకు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం రానుంది. ఈ కేసులో సజ్జనార్ ను విచారించిన తర్వాత మరోసారి సిట్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ విచారణ చేయనుంది త్రిసభ్య కమిటీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version