థీయేట‌ర్స్‌లోనే సినిమాలు చూడాలి : ప్రేక్ష‌కులను కోరిన ఎన్టీఆర్

-

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల‌ని ప్రేక్ష‌కులను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కోరారు. సంక్రాంతికి విడుద‌ల అవుతున్న అన్ని సినిమాల‌ను క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తు థీయేట‌ర్ ల‌లోనే సినిమాలు చూడాల‌ని ప్రేక్ష‌కుల‌కు ఎన్టీఆర్ విజ్ఞాప్తి చేశారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా కొత్త చిత్రాల‌ను, కొత్త న‌టీ న‌టుల‌ను ఆదరిస్తార‌ని అన్నారు. ఈ సంక్రాంతికి కూడా కొత్త హీరోల సినిమాలు విడుద‌ల అవుతున్నాయ‌ని వాటిని కూడా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరారు.

ఈ సంక్రాంతికి నిర్మాత దిల్ రాజ్ సోద‌రుడు శిరీష్ కుమారుడు ఆశీష్ హీరోగా రౌడీ బాయ్స్ అనే సినిమా విడుద‌ల అవుతుంద‌ని తెలిపారు. ఈ సినిమా మంచి క‌థ‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు ఈ సంక్రాంతికి విడుదల అవుతుంద‌ని తెలిపారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు. కాగ కాసేప‌టి క్రితం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రౌడీ బాయ్స్ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సంక్రాంతికి విడుద‌ల అవుతున్న సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆద‌రించాల‌ని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version