ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాల నాశనం: ప్రధాని మోడీ

-

దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాలన్నింటిని ధ్వంసం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి చర్యలు దేశాన్ని బలహీన పరిచేలా ఉన్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోంది అని విమర్శించారు.

కూటమిలోని మరో పార్టీ తన మేనిఫెస్టోలో దేశానికి వ్యతిరేకంగా ప్రకటన చేసింది అని ఆరోపించారు . వారంతా అణ్వాయుధాలను నాశనం చేసి ఇండియాను శక్తి హీనంగా మార్చనున్నారు అని అన్నారు. దేశ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కావాలనే అభివృద్ధి చేయకుండా వదిలేశాయి. కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటుంది అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version