కొంపలు ఆర్పేస్తున్న ఓఎల్ఎక్స్…!

-

ఆన్లైన్ చీటింగ్ పాల్పడుతున్న భరత్ పూర్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. తొమ్మిది మందిని అరెస్టు చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఓఎల్ఎక్స్ ఫేస్ బుక్ మార్కెటింగ్ లో వస్తువుల అమ్మకాలు పేరుతో భారీ మోసం చేస్తున్నారు. వస్తువులను కొనుగోలు అమ్మకాలు చేస్తామంటూ భరత్ పూర్ గ్యాంగ్ మోసాలకు పాల్పడుతుంది. ఓఎల్ఎక్స్ లో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్ గా గుర్తించారు.

భరత్ పూర్ గ్యాంగ్ నుంచి ఎనిమిది వందల పైచిలుకు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని మోసం చేసిన తర్వాత సిమ్ కార్డు ఇంటిలో దాచిపెట్టిన భరత్ పూర్ గ్యాంగ్… ఇళ్ళల్లో సోదాలు చేసారు. తొమ్మిది మంది ఇళ్లలో సంచుల కొద్ది సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది నిందితుల దగ్గర్నుంచి వేలకొద్దీ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ ప్లస్, ఓఎల్ఎక్స్ లో కొనుగోలు అమ్మకాలు జరిపే ముందు జాగ్రత్తగా ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version