రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదు

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. ఇప్పటికే నరేంద్ర మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందకు రాహుల్​పై కేసు నమోదవ్వడంతో పాటు రెండేళ్లు జైలు శిక్ష కూడా విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.

ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదవ్వడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల ఆయన లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వీర్‌ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు స్పందించిన సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ బుధవారం పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.

కాంగ్రెస్‌ అగ్రనేత నిరాధారంగా తన తాత సావర్కర్‌పై ఆరోపణలు చేశారని సత్యకి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గొప్ప వ్యక్తిపై రాహుల్‌ తప్పుడు ఆరోపణలు చేశారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు నిజమని కోర్టులో నిరూపించాలని సవాల్‌ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version