తెలుగు అకాడమీ కేసు : స్కామ్ ప్లాన్ చేసిన నిందితుడు అరెస్ట్ !

-

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేస్ లో మరో కీలక నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు లో కృష్ణా రెడ్డి అనే వ్యక్తిని సీపీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా రెడ్డి అరెస్ట్ తో తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసు అరెస్టుల సంఖ్య 16 కు చేరింది.

బ్యాంకు నుంచి డబ్బులు కొల్ల గొట్టాలని ప్లాన్ చేసిందే ఇవాళ అరెస్ట్ అయిన కృష్ణా రె డ్డిదేనని సీపీఎస్ పోలీసులు విచారణ ద్వారా తెలుసుకున్నారు. ఈ కేసు లో నిందితుడు సాయి కుమార్ కు సలహా ఇచ్చినందుకు ఏకంగా కృష్ణా రెడ్డి రెండున్నర కోట్లు తీసుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

మొదట్లో కృష్ణా రెడ్డి సాయికుమార్ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్ల కొల్ల గొట్టడం పై సమా వేశాలు జరిపారు. పెద్ద మొత్తంలో వాటాను డిమాండ్ చేయడంతో కృష్ణా రెడ్డిని సాయి కుమార్ పక్కన పెట్టాడు. అయితే చివరికి ఇద్దరు ఒకటై.. ఈ స్కామ్ కు తెరలేపరని సీపీఎస్ పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news