ఇంట్లో దోమలను సంహరించడానికి వాడే ఎన్నో రసాయన క్రిమిసంహారులు ఎంత ప్రమాదమో తెలిసిందే. అయితే అన్ని విషయాలు తెలిసినా ఎందుకో వాటినే ఇళ్లల్లో వాడుతూ అనారోగ్య బారిన పడుతుంటారు. కాగా ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఒకే ఇంటికి చెందిన ఆరుగురు వ్యక్తులు మస్కిటో కాయిల్ ను వెలిగించడం వలన అందులో నుండి వెలువడిన కార్బన్ మోనాక్సయిడ్ ను పీల్చిన వారు అంతా పొద్దునకల్లా శవాలై పోయారు. అయితే ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మరో వ్యక్తి మరణించాడు. చిత్తూరు జిల్లా మర్లపల్లికి చెందిన నిరంజన్ అనే వ్యక్తి ఇంట్లో దోమలు వెళ్లాలని మస్కిటో కాయిల్ ను వెలిగించి నిద్రపోయాడు. కానీ అర్ధరాత్రిలో కాయిల్ నిప్పు ఇంట్లోని బట్టలకు తగులుకుని మంటలు వచ్చాయి.