ఆపరేషన్ సిందూర్లో భాగంగా మరింత రెచ్చిపోయిన దాయాది పాకిస్తాన్.. జమ్ముకాశ్మీర్లోని పూంచ్ జిల్లా అజోట్ గ్రామంలో మోర్టార్ షెల్స్ ద్వారా పెద్దఎత్తున కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో సామాన్య పౌరుల ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అంతేకాకుండా.. జమ్మూ, పఠాన్కోట్, ఉద్ధంపూర్ ప్రాంతాల్లో పాక్ మిస్సైళ్లతో దాడిచేసినట్లు సమాచారం. అయితే, ఆ దాడులను భారత్ సమర్థంగా ఎదుర్కొన్నట్లు తెలిసింది. అఖ్నూర్, సామ్బా, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో రాత్రి సమయంలో పెద్దఎత్తున శబ్దాలు, సైరన్లు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రిపూట సరిహద్దు ప్రాంతాల్లోభారీ స్థాయిలో భారత ఆర్మీ గస్తీ నిర్వహించింది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి బోర్డర్ క్రాస్ చేస్తున్న అనుమానితులను ఆర్మీ బలగాలు మట్టుబెట్టాయి.