గీతం వర్సిటీపై రోజా ఆరోపణలు.. ఖండించిన పంచుమర్తి అనురాధ

-

ఏపీ మంత్రి రోజా, వైజాగ్ లో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన గీతం యూనివర్సిటీ 40 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రభుత్వ ధనాన్ని సొంతానికి వాడుకోవడం వైసీపీ నాయకత్వానికి స్వాభావికంగా వచ్చిన దోపిడీ అలవాటని మండిపడ్డారు అనురాధ.

ఇడుపులపాయలో దళితుల అసైన్డ్ భూములు ఆక్రమించుకుని ఎస్టేట్ నిర్మించుకుంది ఎవరు? అని ఆమె ప్రశ్నించారు. రూ.40 కోట్ల ప్రజాధనాన్ని జగన్ రెడ్డి తన సొంత ఇంటికి ఏ విధంగా వాడుకున్నాడో మేం ఆధారాలతో వస్తాం…డిబేట్ కు వచ్చే ధైర్యం వైసీపీ ఉందా? అని సవాల్ చేశారు ఆమె. గుడ్డ కాల్చి ఎదుటివారిపై వేయడం వైసీపీ నేతలకు అలవాటేనని, ఇవాళ రోజా కూడా అదే రీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు అనురాధ.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version