నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు…!

-

నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రీసెంట్ గా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్రం లోక్ సభలో తొలిరోజే వ్యవసాయ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇక ఇప్పటికే బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలు అందరూ సభకు హాజరు కావాలని విప్ జారీ చేశాయి.

Parlament

కనీస మద్దతు ధరలు చట్టబద్దత, రైతుల డిమాండ్ l పై కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం మరో 25 బిల్లులను ప్రవేశ పెట్టనుంది. ఇదిలా ఉంటే తెలంగాణ లో వరి పంట కొనుగోలు పై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయం పై కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ ఎంపీలతో సమావేశం అయ్యి వారికి దిశా నిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version