వైసీపీ హయాంలోనే డ్రగ్స్‌ దందా పెరిగింది : పవన్‌ కళ్యాణ్‌

-

ఏపీ డ్రగ్స్ దందాపై మరోసారి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ట్వీట్‌ చేశారు. 2018 నుంచి తాను డ్రగ్స్‌ స్మగ్లింగ్ విషయాన్ని హైలెట్ చేస్తూనే ఉన్నానని పేర్కొన్న పవన్‌ కళ్యాణ్‌… వైసీపీ హయాం లోనే గంజాయి స్మగ్లింగ్ మరింత పెరిగిందని ఫైర్‌ అయ్యారు. ఏవోబీ లో గంజాయి సమస్య ఇప్పుడు కొత్త గా వచ్చింది కాదన్నారు పవన్‌ కళ్యాణ్‌. 15-20 ఏళ్ల నుంచి ఏపీలో గంజాయి సమస్య ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

pawan kalyan

గంజాయి స్మగ్లింగ్ అనేది సామాజిక, ఆర్దికపకమైన అంశంగా చూడాలని…. గంజాయి స్నగ్లింగును అరికట్టేలా వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌. అందరికీ ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించాలని… అందరికీ ఉపాధి లభించినప్పుడే గంజాయి వ్యాపారానికి అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు పవన్‌ కళ్యాణ్‌. ఉపాధి అవకాశాలపై వైసీపీ సర్కార్‌ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version