శ్రీలంక అధ్యక్షుడుకి పట్టిన గతే జగన్ కు పడుతుంది – పవన్ కళ్యాణ్

-

శ్రీలంక అధ్యక్షుడుకి పట్టిన గతే జగన్ కు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనవాణి కార్యక్రమంలో పవన్ ఈ కామెంట్స్ చేశారు. అధికారంలోకి రావటానికి పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు సీఎం జగన్‌… విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తా అన్న హామీ ఏమైందని నిలదీశారు.

అధికార మదంతో వుంటే శ్రీలంక అధ్యక్షుడుకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు పవన్‌. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. భీమవరంలో జూలై 17 వ తేదీ జనవాణి నిర్వహిస్తామని పవన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version