నన్ను నాశనం చేయడానికి గ్యాంగ్ లు తిరుగుతున్నాయి : పవన్ కళ్యాణ్

-

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నాడు. వరుసగా బహిరంగ సభలు రోడ్ షో లు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ సంఖ్యను పెంచుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఉదయం రాజోలులో జరిగిన రోడ్ షో గురించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ నిన్న రోడ్ షో లో నాపై దాడి చేయడానికి నలుగురు యువకులు రాళ్లు పట్టుకుని వచ్చారని చెప్పారు. పక్కనే సెక్యూరిటీ ఉండడంతో నేను తప్పించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత వారిని మా స్టాఫ్ పోలీసులకు అప్పగించారని తెలిపారు. ప్రజల్లో నాకు వస్తున్న స్పందన చూసి అధికార పార్టీలో గుబులు రేగుతోంది అందుకే నన్ను మా నాయకులను నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రత్యేకంగా నన్ను నాశనం చేయడానికి సఫారీ గ్యాంగ్ లు తిరుగుతున్నట్లు చెప్పారు. మరి పవన్ చెబుతున్న విషయంలో వాస్తవం ఉందా ? ఇంతకీ అసలు నిన్న ఏమి జరిగింది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version