పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఫోన్… పక్కన పడేసిన జీవన్ రెడ్డి !

-

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగాలన్న జీవన్ రెడ్డి.. చంపించుకోవడనికే పార్టీలో ఉన్నామా అంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ పక్కన పడేసిన జీవన్ రెడ్డి.. పార్టీలో ఉండను అంటూ తేల్చేశారు.

PCC chief Mahesh Kumar called Congress MLC Jeevan Reddy

అంతకు ముందు అడ్లూరి లక్ష్మణ్‌తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “మీకు.. మీ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి”.. అంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. ఇలా అయినా మమ్మల్ని బతకనివ్వండి అన్నారు. ఇంతకాలం మానసిక అవమానాలకు గురవుతున్నా కానీ తట్టుకున్నామని పేర్కొన్నారు. కాగా, జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య కు గురయ్యాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version