టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

-

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని… కేటీఆర్ దగ్గరి వారికి… డ్రగ్స్ నోటీసులు వచ్చాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Ed నోటీసులు అందిన వారిలో కేటీఆర్‌ సన్నిహితులున్నారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు డ్రగ్స్ కేసు పై భయపడుతున్నారని… Ed..విచారణ చేస్తే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది ఎంటి ? అని ప్రశ్నించారు రేవంత్‌ రెడ్డి. అసలు డ్రగ్స్‌ కేసులో కేటీఆర్ పాత్ర ఉందా.. ? రకుల్ పాత్ర ఉందా అనేది అసలు సమస్యే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

కేటీఆర్‌ కు రకుల్ సన్నిహితులా..? కాదా ? అనేది తనకు సంబంధం లేదని..డ్రగ్స్‌ కేసుపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. గోవా కి ఎందుకు కేటీఆర్ వెళ్ళాడని దానిపై దర్యాప్తు చేయాలన్నారు. డ్రగ్స్ అనేది మన దేశానికి కొత్తేమి కాదని… ఇతర దేశాల్లో మారక ద్రవ్యం మన దేశానికి వస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విచారణ అధికారం ఉండదని… ఇతర దేశాలకు వెళ్లి విచారణ చేయలేరన్నారు. కోర్టుల్లో సర్కారు మేమే విచారణ చేశామని… ఎవరికి వివరాలు ఇవ్వం అంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. డ్రగ్స్ తో పిల్లల జీవితం సర్వ నాశనం చేస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version