చంద్రబాబు మళ్ళీ కుప్పంలో గెలవడు.. గెలవనివ్వం – పెద్దిరెడ్డి

-

చంద్రబాబు మళ్ళీ కుప్పంలో గెలవడు.. గెలవనివ్వబిమని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ చేశారు.  ప్రపంచంలో పనికిమాలిన నాయకుడు చంద్రబాబు అని… బయటి వ్యక్తులను తీసుకువచ్చి వైసిపి నేతలపై దాడి చేయించారని మండిపడ్డారు. రెండు రోజులుగా కుప్పంలో జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

కుప్పంలో ఇక గెలవలేమనే నిరాశతో టిడిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 33 ఏళ్లుగా కుప్పానికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని, ప్రజలపై దాడులు చేయడం నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్సార్ సిపి కార్యకర్త సురేష్ ఇంటిపై దాడి చేశారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొనేలా చంద్రబాబు ప్లాన్ చేసి బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి దాడులు చేయించారని ఆగ్రహించారు. మేము దౌర్జన్యం చేస్తున్నామని ఆరోపిస్తున్నారు. దౌర్జన్యాలతో కుప్పంలో గెలవాలన్నది చంద్రబాబు ఆలోచన. ప్రజలపై దాడులు చేయడం నీతిమాలిన చర్య ఆని నిప్పులు చెరిగారు. రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయ కుట్రలతో హంద్రినీవా పనులకు ఆటంకం కలిగిస్తున్నారు. ఎన్నికల్లోపే కుప్పం కెనాల్ పూర్తి చేస్తామన్నారు పెద్దిరెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version