నేనేంటో నా మనస్తత్వం ఏంటో ఇక్కడి ప్రజలకు తెలుసు : ఎంపీ అవినాష్ రెడ్డి

-

నేనేంటో నా మనస్తత్వం ఏంటో ఇక్కడ ప్రజలకు తెలుసు అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.కడప జిల్లాలోని పులివెందులలో వైసీపీ బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..

గడిచిన 3 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉన్నారు.. అయినా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ప్రజలతోనే ఉన్నాను అని తెలిపారు. ఎన్ని కుట్రలు చేస్తారో చేసుకోండి.. మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను ప్రజలలోనే ఉంటాను.. నేను ఏ తప్పు చేయలేదు.. ఇదే ఆత్మవిశ్వాసంతో ఉంటా ప్రజలతోనే ఉంటా ప్రజల కోసమే ఉంటాను అని అవినాష్ రెడ్డి వెల్లడించారు. కాగా, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కడప నుంచి వైసీపీ తరుఫున సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేయనున్నారు.కాంగ్రెస్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షరాలు వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల సమరంలో వైఎస్ కుటుంబ సభ్యులు పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version