తెలంగాణ సర్కార్ కు షాక్… పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై పిటిషన్ !

-

తెలంగాణ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు లో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. కరోనా మహమ్మారి మూడో దశ ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రత్యక్ష బోధన సరికాదని పిటిషనర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్.

ఇక ఈ కేసుపై 31 వ తేదీన తాత్కాలిక సిజే జస్టిస్ రామ చంద్రరావు విచారణ చేపట్టనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల పునఃప్రారంభం పై ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది కెసిఆర్ సర్కారు. అంతేకాదు అన్ని విద్యా సంస్థల్లోనూ ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని… ఇకముందు ఆన్లైన్ బోధన ఉండదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version