కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు చెబుతున్నారు. మహిళ కోటలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురుచూస్తున్నారు విజయశాంతి, సునీత రావు. ఎమ్మెల్సీ ఆశావాహులు జాబితాలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్, జీవన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, బండి సుధాకర్ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు.
ఇందులో భాగంగా…. నేడు కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. ఈ తరునంలోనే… ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆశావాహులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలు కేటాయింపులు ఉంటాయి. నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని ఆశిస్తోంది సీపీఐ.