ఈనెల 12న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన

-

ఈ నెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. రామగుండంలో పర్యటించనున్న మోదీ.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేశ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమైన సీఎస్.. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుసార్లు తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు.. సీఎం స్థాయిలో కేసీఆర్ హాజరు కాలేదు. అందుకు కారణాలు కూడా కేసీఆర్ వివరించారు. తాజాగా జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్..  ఈ నేపథ్యంలో మోదీని కలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. మోదీ ఈ నెల 11, 12వ తేదీల్లో ఏపీలోని విశాఖలోనూ పర్యటించనున్నారు. 10,472 కోట్ల రూపాయల విలువైన ఏడు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఆంధ్రా విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం తెలంగాణకు పయనం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version