అద్వానికే పంగనామాలు పెట్టిన చరిత్ర మీది… ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజా ఉద్యమాలతో ప్రధాని స్థాయికి ఎదగలేదని.. కేవలం మేనేజ్మెంట్ ద్వారానే ఈ పదవిలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల పట్ల చిన్న చూపు ఉందని మళ్లీ తెలిసిందని అన్నారు. మీరు ఏరోజు కూడా కార్యకర్తల స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజ సమస్యలపై పోరాడి, ప్రజల్లో మమేకం అయి ప్రధాని కాలేదని విమర్శించారు. కొద్ది మంది వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడం, మభ్య పెట్టడం ద్వారా పదవుల్ని పొందారని సంచల వ్యాఖ్యలు చేశారు. అరుణ్ జైట్లీతో మొదలైన మీ మేనేజ్మెంట్ విద్య అద్వాని గారిని నిండా ముంచే వరకు కొనసాగిందని అన్నారు. గుజరాత్ లో కేశూభాయ్ పటేల్ ను ముఖ్యమంత్రిగా తప్పించేటప్పుడు.. అరుణ్ జైట్లీని అడ్డం పెట్టకుని.. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గురువు అద్వానికి పంగనామాలు పెట్టావని విమర్శించారు. నమ్మిన వారిని నట్టేటా ముంచడంలో, నమ్మించి మోసం చేయడంతో నరేంద్రమోదీకి ఉన్న అనుభవం దేశం మొత్తానికి తెలుసని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version