నాగ‌శౌర్య ఫామ్ హౌస్ పోలీసుల దాడి..పేకాట రాయుళ్ల అరెస్ట్..!

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య విల్లాపై పోలీసులు దాడులు చేశారు. నాగ‌శౌర్య విల్లాలో పేకాట ఆడుతున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలో ఉన్న మంచిరేవుల వ‌ద్ద ఉన్న విల్లాపై పోలీసులు దాడి చేశారు. సుమ‌న్ అనే వ్య‌క్తి పుట్టిన‌రోజు ఫంక్ష‌న్ కోసం ఈ విల్లాను అద్దెకుతీసుకుని పేకాట స్థావ‌రం గా మార్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు దాడి చేసిన స‌మ‌యంలో ప్రధాన నింధితుడు సుమ‌న్ ప‌రారయ్యాడు.

దాంతో పేకాట ఆడుతున్న ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల‌క్ష‌ల్లో న‌గ‌దు, మొబైల్ ఫోన్లు, కార్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌ధాన నింధితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ విల్లాను నాగ‌శౌర్య ఆరు నెల‌ల కోసం అద్దెకు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక త‌న ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకుని పేకాట ఆడుతున్న విష‌యం నాగ‌శౌర్య‌కు తెలుసా లేదా అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news