మోసపోయాను న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా హీరో.. కారణం..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు సైతం మొదట మంచి సినిమాలలో నటించి ఆ తరువాత కనుమరుగైన హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో సాయి కిరణ్ కూడా ఒకరు. నువ్వే కావాలి చిత్రం ద్వారా మంచి ఫేమస్ అయిన సాయికిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మొదటిసారిగా ఈ చిత్రంతో పరిచయమైన కిరణ్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి యాక్టర్గా పేరు పొందాడు. అయితే ఆ తరువాత హీరోగా మాత్రం ఎదగలేక పోయాడు.

దీంతో పలు టీవీ సీరియల్స్లో కూడా నటిస్తున్నారు. తాజాగా సాయి కిరణ్ మోసపోయిన ట్లుగా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. తన దగ్గర అప్పుగా తీసుకుని కొందరు వ్యక్తులు మోసం చేశారు సాయికిరణ్ జూబ్లీహిల్స్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. తన దగ్గర నుంచి తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వడమే కాకుండా వారు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారనే విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు గత నాలుగు రోజుల కిందట చేసినట్లుగా సమాచారం ఈ విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు.

అయితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నిర్మాత జాన్ బాబు, లివింగ్ స్టన్ లకు సాయి కిరణ్ దగ్గరనుండి రూ.10.6 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. వాటిని అడగగా బెదిరిస్తున్నారని దీంతో కొన్ని మోసపోయానని తెలుసుకొని న్యాయం చేయాలంటూ సాయికిరణ్ ఫిర్యాదు చేయడం జరిగింది. పైగా డబ్బులు అడిగితే తను బెదిరిస్తున్నట్లు గా కూడా ఫిర్యాదులో తెలిపారు సాయికిరణ్ ఫిర్యాదు మేరకు వీరిద్దరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలియజేయడం జరిగింది. ఇక వీరిపై 406,420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సాయి కిరణ్ పలు సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version